న్యూఢిల్లీ : ఢిల్లీలోని మాలవ్య నగర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి డబ్బు డిపాజిట్ చేసేందుకు బ్యాంక్కు వెళ్తుండగా కొందరు దుండగులు అతనిపై కాల్పులకు తెగబడ్డారు. దుండగుల కాల్పుల్లో ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దుండగులు డబ్బు కోసమే కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. కాగా సీసీ టీవీ పుటేజీ ఆధారంగా అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.