ఏపీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనపై కూటమి నేతలు భేటీ అయ్యారు. గురువారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమైన కూటమి నేతలు... రాష్ట్రంలో ప్రధాని పర్యటన నిర్వహణపై మూడు పార్టీల నేతలు చర్చలు నిర్వహించారు. ఈనెల 7, 8 తేదీల్లో రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. రాజమండ్రి, అనకాపల్లి, రాజంపేట, విజయవాడ పార్లమెంట్ స్థానాల పరిధిలో ప్రధాని పర్యటన సాగనుంది. ఈ సమావేశంలో సిద్దార్థ్ నాథ్ సింగ్, సుజనా చౌదరి, కేశినేని చిన్ని, గద్దె రామ్మోహన్, అమ్మిశెట్టి వాసు, పసుపులేటి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.