చెన్నై : ఆదాయపన్ను శాఖ అన్నాడీఎంకే మాజీ నాయకురాలు శశికళ, ఆమె సన్నిహితులు, బంధువుల ఇళ్లపై, ఆస్తులపై జరిపిన దాడులలో రూ.1400 కోట్ల అక్రమాదాయం వెలుగు చూసింది. ఆదాయపన్ను శాఖ అధికారులు గత ఆరు రోజులుగా పెద్ద ఎత్తున శశి, ఆమె సన్నిహితులు, బంధువుల ఇళ్లపై ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. శశికళ, ఆమె సమీపబంధువు దినకరన్, జయ టివీ కార్యాలయం సహా మొత్తం 187 ప్రాంతాలలో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. పన్ను ఎగవేత ఆరోపణలపై జరిగిన ఈ తనిఖీలలో లెక్కలలో చూపని రూ.1400 కోట్లను కనుగొన్నట్లు అధికారులు తెలిపారు.