విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ముస్లీం సంఘాలతో కూటమి పార్టీల బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి సమావేశమయ్యారు. భవిష్యత్లో ముస్లీం సమాజం కోసం చేపట్టబోయే కార్యాచరణను ఈ సందర్భంగా సుజనా వివరించారు. ప్రధాన సమస్యలను నిర్ధిష్ట కాల పరిమితిలో పరిష్కరిస్తానని వారికి బీజేపీ అభ్యర్థి భరోసా ఇచ్చారు. అనంతరం సుజనా చౌదరి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా వాడుకుంటుందని.. కానీ మోదీ వచ్చిన తర్వాత దేశంలో ముస్లీంలకు ఒక భరోసా ఇచ్చారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అనుసంధానం చేసి ముస్లీం, క్రిస్టియన్, ఎండోమెండ్ ఆస్తులను కాపాడుకుందామన్నారు.