ఫెర్రీ వద్ద కృష్ణానదిలో బోటు బోల్తా పడిన ఘటనపై కృష్ణా జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. బోటు నడిపేందుకు రివర్ బోటింగ్ సంస్థకు అనుమతి లేదని, పరిమితికి మించి పర్యాటకులను బోటులో ఎక్కించడం వల్లనే ప్రమాదం జరిగిందని నివేదికలో పేర్కొన్నారు. బోటును ఒక్కసారిగా మలుపు తిప్పడంతోనే ప్రమాదం జరిగిందని, డ్రైవర్కు లైసెన్సు లేదని నివేదికలో స్పష్టం చేశారు. జిల్లాస్థాయిలో జలరవాణా భద్రతా సమావేశాలు జరగాలని సూచించారు.