విశాఖ: అరుకులో జరుగుతున్న ఎయిర్బెలూన్ ఫెస్టివల్లో గందరగోళం నెలకింది. ఈ ఫెస్టివల్కి 13 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఫెస్టివల్ గురించి ముందుగా ప్రచారం లేక కార్యక్రమంలో పర్యాటకుల సందడి కానారలేదు. నిర్వాహకుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఫెస్టివల్కు వచ్చిన అతిధులు ఇబ్బందులు ఎదుర్కున్నారు. క్యాంపులోకి మీడియాకు అనుమతి నిరాకరించి, అధికారులు, విదేశీ ప్రతినిధులకే ఫెస్టివల్ని పరిమితి చేశారు. కాగా పరికరాలు సక్రమంగా లేకపోవడంతో రెండు బెలూన్లు గాల్లోకి వెళ్లలేదు.