లక్నోలో ఒక హొటల్లో అగ్ని ప్రమాదం సంభవించి ప్రక్కనే ఉన్న మరొక హొటల్లోకి కూడా వ్యాపించింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ, ఒక చిన్నారి సహా ఐదుగురు మృతి చెందారు. మరొక ముగ్గురు తీవ్రమైన కాలిన గాయాలకు గురయ్యారు. చార్బాగ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఎస్ఎస్జె ఇంటర్నేషనల్ హొటల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు పక్కనే ఉన్న విరాట్ ఇంటర్నేషనల్ హొటల్లోకి కూడా వ్యాపించాయి. నేటి ఉదయం 6 గంటలకు అగ్ని ప్రమాదం సంభవించిందని అగ్నిమాపక దళానికి చెందిన ఒక అధికారి చెప్పారు. సుమారు 50 మంది అతిథులను మంటలబారినుంచి రక్షించామని ఆ అధికారి తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందన్నారు.