అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ సూచనల మేరకు టీడీపీ ఎస్టీ సెల్ నగర అధ్యక్షులు మనోహర్ గురువారం అమ్మవారి చెరువు కొట్టాలు, ఎస్టీ కాలనీలలో ప్రచారం నిర్వహించారు. మనోహర్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో ఎస్టీలకు జరిగిన అభివృద్ధిని వివరించారు. అలాగే వైసీపీ ప్రభుత్వం ఎస్టీలకు చేసిందేమీ లేదన్నారు. ఎస్టీలకు అభివృద్ధి జరగాలంటే టిడిపి ప్రభుత్వం తోనే సాధ్యం అని అన్నారు.