ఓబులవారిపల్లె మండలం కొర్లకుంట గ్రామంలో గురువారం తెల్లవారుజామున తుంగా గంగాధర్ రెడ్డి ఇంట్లో ఇన్కమ్ టాక్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. గంగాధర్ రెడ్డి ప్రవాస ఆంధ్రుడు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుండి కోటి రూపాయలకు పైగా బ్యాంకు లావాదేవీలు జరిపినట్లు సమాచారం రావడంతో ఇన్కమ్ టాక్స్ అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది. వైసీపీ నాయకులు సాయి కిషోర్ రెడ్డి ఇంటి ముందే సోదాలు జరుగుతున్నాయి.