రాయదుర్గం తాలూకా బొమ్మన్ హాల్ మండలం శ్రీధర్ ఘట్ట గ్రామంలో గురువారం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కాలువ శ్రీనివాసులు ర్యాలీ నిర్వహించారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాల్వ శ్రీనివాసులు సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు చేస్తుందని అమలు కావాలంటే చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా, తనని రాయదుర్గం ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను కోరారు.