శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీ 6వ సెమిస్టర్ ఇంటర్న్షిప్ మూల్యాంకనం నేటినుండి 3 రోజులపాటు షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని యూనివర్సిటీ ఎగ్జామినేషన్ డీన్ ఎస్ ఉదయభాస్కర్ గురువారం తెలిపారు. ఇప్పటికే జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల శ్రీకాకుళం, ఇచ్చాపురం, టెక్కలి, పాలకొండ, రాజాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్, యాజమాన్యాలకు షెడ్యూల్ నోటిఫికేషన్ అధికారులు అందజేశారు.