రాజంపేట నియోజకవర్గం రాజంపేట రూరల్, ఊటుకూరు , గ్రామ పంచాయతీలలో గురువారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి సుగవాస బాలసుబ్రహ్మణ్యంకు ఓటు వేసి అత్యధిక ఓట్లు మెజారిటీతో గెలిపించాలని జనసేన పార్టీ రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త యల్లటూరి శ్రీనివాస్ రాజు ఓటర్లను అభ్యర్థించారు. వారు మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.