నియోజకవర్గ టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు కందుకూరు మండలం మాచవరంలో బుధవారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎస్టీ కాలనీ, అయ్యలరెడ్డి కొండ, ఎస్సీ కాలనీ, చివరగా గ్రామంలో ప్రతి ఇంటికి దుకాణానికి వెళ్లి సైకిల్ గుర్తుపై ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మాచవరం ఓటర్లు ఈసారి టిడిపికి మద్దతు పలకాలని నాగేశ్వరరావు కోరారు.