చెన్నేకొత్తపల్లి మండలం, యర్రంపల్లి, నరసింగ రాయుని పల్లి, చిన్నమొగలయా పల్లి, గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులు గురువారం టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే అభ్యర్థి పరిటాల సునీత ఆధ్వర్యంలో చేరారు. కార్యక్రమంలో వెంకటరెడ్డి, తిరుపాల్, మాధవి, లోకనాథ్ రెడ్డి, అజయ్, మధు, వేణు, అంజనమ్మ, నారాయణ గ్రామానికి చెందిన డోలా గోపాలరెడ్డి, డోలా నిర్మల, తిమ్మయ్య కృష్ణారెడ్డి, హరీష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.