రైల్వే కోడూరులోని బత్యాల కార్యాలయంలో గురువారం పట్టణంలోని 22 మంది బూత్ కన్వీనర్లు, ముఖ్య నాయకులతో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల రాయుడు సమావేశం నిర్వహించారు. 13వ తేదీ జరగబోయే ఎలక్షన్ పై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బూత్ కన్వీనర్లకు, పోలింగ్ కేంద్రంలో ఏజెంట్ కు ప్రతి ఓటర్ పై అవగాహన కలిగి ఉండాలని, ప్రతి బూత్ లో నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని కోరారు.