జమ్మలమడుగు నియోజకవర్గం అభివృద్దే తమ ధ్యేయమని ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి అన్నారు. గురువారం ఎర్రగుంట్ల మండలంలోని చిలంకూరు, రంగసాయపురం, కర్చుకుంటపల్లి, చిర్రాజు పల్లి, దండుపల్లి, వలసపల్లి, తుమ్మలపల్లి, పెదనపాడు, కోడూరు, సుంకేసుల, తిప్పలూరు, ఎర్రగుంట్ల నగర పంచాయితీలోని ప్రధాన రహదారుల వెంబడి ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు.