టిడిపి అధికారంలోకి వస్తే అన్ని గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఒంటిమిట్ట మండల టిడిపి ఇంచార్జి సుగవాస శ్రీనివాసులు అన్నారు. కడప జిల్లా ఒంటిమిట్ట మండల పరిధిలోని నడింపల్లి గ్రామంలో గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వంలో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బంది పడ్డారని అన్నారు. టిడిపి అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహిస్తారని తెలిపారు.