అనంతపురం నగరంలోని జీసస్ నగర్ లో నివాసం ఉంటున్న ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నల్లపల్లి విజయ్ భాస్కర్ మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు అనే ఫ్లెక్సీ ను ఏర్పాటు చేసారు. సాధారణ ఎన్నికలు జరుగుతున్న సందర్బంలో ఈ ఫ్లెక్సీ ప్రాధాన్యత ను సంతరించుకుంటోంది. ఈ సందర్భంగా విజయ్ భాస్కర్ మాట్లాడుతూ ప్రజలందరూ డబ్బు తీసుకోకుండా నిజాయితీ తో ఓటు వేయాలని ఆయన అన్నారు.