చేనేత పితామహుడు ప్రగడ కోటయ్య మనమడు, చీరాల నుండి గాజు గ్లాసు గుర్తుతో ఇండిపెండెంట్ గా పోటీకి దిగిన పోలిశెట్టి శ్రీనివాసరావు గురువారం ఎన్నికల రంగం నుండి వైదొలగి టిడిపి అభ్యర్థి మద్దులూరి మాలకొండయ్యకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. శ్రీనివాసరావుకు కొండయ్య పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. చేనేతల వికాసానికి కొండయ్య హామీ ఇచ్చినందున తాను సంతృప్తి చెంది పోటి నుండి తప్పుకున్నట్లు పోలిశెట్టి చెప్పారు.