చిలమత్తూరు: చాగలేరు పంచాయితీ శానగానపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ కు శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. కోడూరు పంచాయితీలో ఓ పరిశ్రమకు వస్తున్న నేపథ్యంలో గోరంట్ల మండలం పాపిరెడ్డిపల్లి నుండి బూదిలి మలుపు దగ్గర ద్విచక్రవాహనాన్ని సిమెంట్ లారి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన వెంకటేష్ ను 108 సహాయంతో ఆసుపత్రికి తరలించారు.