అస్సాంలో వరద ధాటికి రాష్ట్రంలో 27 జిల్లాలో ఆరు లక్షల మందికిపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. అయితే వారందరికి అధికారులు ప్రభుత్వ భవనాల్లో పునరావాసం కల్పిస్తున్నారు. అలాగే 1,089 గ్రామాలు నీట మునిగాయి.
ఇదిలా ఉంటే అసోంలో వరద బీభత్సానికి ఎంతోమంది తమ గూడును, నీడను కోల్పోయారు. జలమయమైన గ్రామాల్లో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ధీనంగా సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వెళ్లే దారిలేక.. తినడానికి తిండి లేక అల్లాడుతున్నారు. ఈ జలవిలయానికి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇప్పటి వరకు అధికారికంగా చనిపోయిన వారి సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. అనధికారంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండే అవకాశం లేకపోలేదు.