అసోంలో వరద బీభత్సానికి ఎంతోమంది తమ గూడును, నీడను కోల్పోయారు. జలమయమైన గ్రామాల్లో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ధీనంగా సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అస్సాంలోని పలు జిల్లాలో కట్టలు తెగిపోయాయి. రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. దాంతో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. చాలా ప్రాంతాల్లో పాఠశాలల భవనాలు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల కొండ చరియలు విరిగిపడడంతో చాలా ఇళ్లు కూలిపోయాయి. పంట పొలాలు నాశనం అయ్యాయి. ఒక్క నాగోన్ జిల్లాలోనే 2.88 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. కొండ ప్రాంతమైన డిమా హసావో జిల్లాలో రైలు, రోడ్డు కనెక్టివిటీ తెగిపోయింది. అదే ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. కాచర్, కరీంగంజ్, హైలకండి జిల్లాలో రహదారులు కొట్టుకుపోయాయి. దాంతో రాకపోకలకు అవకాశం లేకుండా పోయింది. మరోవైపు ఆర్మీ, పారామిలట్రీ బలగాలు, పోలీసులు రంగంలోకి దిగి వరద బాధితులకు సాయం చేస్తున్నారు. ఇళ్లల్లో చిక్కుకుపోయిన వేలాది మందిని రక్షించారు.