ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు.. బోణీ కొట్టిన వైసీపీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 19, 2021, 11:36 AM

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. నెల్లూరు జిల్లా కొవ్వూరులో తొలి ఫలితం వెలువడింది. ఆ ప్రాంతంలో వైసీపీ బోణీ కొట్టింది. ఆమంచర్ల ఎంపీటీసీగా వైసీపీ అభ్యర్థి 760 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సౌత్‌ మోపూరు స్థానంలోనూ వైసీపీ అభ్యర్థి గెలుపొందారు.  కొవ్వూరులోని బ్రహ్మయ్య ఇంజనీరింగ్ కాలేజీలో కొవ్వూరు, నెల్లూరు రూరల్‌ నియోజకవర్గాలకు చెందిన ఓట్లు లెక్కిస్తున్నారు.


సాయంత్రం 4 గంటలలోపు కౌంటింగ్‌ పూర్తి కానుంది. ఇత‌ర ప్రాంతాల్లోనూ ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. అనంతపురం జిల్లా మడకశిరలో ట్రాఫిక్‌ ఎస్సైగా పనిచేస్తున్న అంజాద్‌ అలీ ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద  సొమ్మసిల్లి పడిపోయారు. ఆయ‌న‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. క‌రోనా నేపథ్యంలో ర్యాలీలు, విజయోత్సవాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com