ఇండియాలో గడిచిన 24 గంటల్లో 44,658 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనా నుంచి 32,988 మంది కోలుకోగా 496 మంది కరోనాతో చనిపోయారు. దేశంలో ఇప్పటివరకు మొత్తం 3,26,03,188 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు వరకు 3,18,21,428 మంది కోలుకోగా 4,36,861 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశంలో 3,44,899 యాక్టీవ్ కేసులున్నాయి.