ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 14, 2021, 09:10 AM

దేశ వ్యాప్తంగా రియల్ ‌టైమ్‌ గ్రాస్‌ సెటిల్మెంట్(ఆర్‌టీజీఎస్‌)‌ సేవలు ఏప్రిల్‌ 18వ తేదీన మధ్యాహ్నం 2 గంటల వరకు నిలిచిపోనున్నాయని ఆర్బీఐ ప్రకటించింది. ఆర్‌టీజీఎస్‌ సేవల విషయంలో భారీ స్థాయిలో అప్‌గ్రేడేషన్‌ జరుగుతోంది. డిజాస్టర్‌ రికవరీ సమయాన్ని పెంచేందుకు టెక్నికల్‌ అప్‌గ్రేడ్‌ చేస్తున్నారు. దీంతో ఆరోజున కొన్ని గంటల పాటు ఆర్‌టీజీఎస్‌ సేవలను నిలిచిపోనున్నాయని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఆ సమయంలో డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవాలంటే నేషనల్‌ ఎలక్ట్రానిక్ ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ సేవలను వినియోగించుకోవచ్చు. నెఫ్ట్‌ సేవల విషయంలో ఎలాంటి అంతరాయం ఉండదని ఆర్బీఐ తెలిపింది. గత సంవత్సరం డిసెంబర్‌ నుంచి ఆర్‌టీజీఎస్‌ సేవలు 24 గంటల పాటు అందుబాటులోకి వచ్చాయి. కస్టమర్లు ఎప్పుడైనా ఆర్టీజీఎస్‌ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేయవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com