విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై హైపవర్ కమిటీ సీఎం జగన్కు నివేదిక అందించింది. సోమవారం సీఎంతో సమావేశమైన కమిటీ నివేదికలోని అంశాలపై చర్చించింది. తమ విచారణలో తేలిన అంశాలను సీఎంకు వివరించింది. ఎల్జీ పాలిమర్స్లో గ్యాస్ లీకేజీకి కారణాలు.. ఘటన జరిగిన సమయంలో ఏం జరిగింది. నిర్లక్ష్యం ఎవిరిది అనే అంశాలపై కమిటీ అధ్యయనం చేసింది. ఆ కంపెనీలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? భవిష్యత్లో లీకేజీ ప్రభావం ఉంటుందా అనే అంశాలను నివేదికలో ప్రస్తావించినట్లు సమాచారం. మే ఏడున విశాఖలోని వెంకటాపురం సమీపంలోని ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టైరిన్ గ్యాస్ లీక్ కావడంతో 15మంది చనియిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో వందలాదిమంది అస్వస్థతకు గురయ్యారు. వీరంతా ఆస్పత్రుల్లో చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. గ్యాస్ దెబ్బకు వందలాదిగా పశువులు, పక్షలు సైతం ప్రాణాలు కోల్పాయాయి. పెద్దపెద్ద చెట్లు సైతం మాడిపోయాయి. కమిటీ నివేదికలో ఏముంది? నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అన్న అంశం తేలాలంటే మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.