ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయులు మళ్లీ బడిబాట పట్టనున్నారు. యూపీ, హైస్కూల్ ఉపాధ్యాయులు ప్రతీ సోమ, మంగళవారాల్లో విధులకు హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రతీ ప్రాథమిక పాఠశాల టీచర్లు వారంలో ఒక రోజు, ప్రతీ మంగళవారం హాజరు కావాలని ఆదేశాల్లో పేర్కొంది. బ్రిడ్జి కోర్సులను రూపొందించేందుకు హాజరుకావాలని ప్రభుత్వం వెల్లడించింది. నాడు-నేడు పనులు అన్ని స్కూళ్లల్లో ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.