ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ. 20 వేలలోపే 5జీ ఫోన్లు..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 21, 2020, 05:08 PM

క్వాల్ కాం తీసుకువచ్చిన స్నాప్ డ్రాగన్ 690 ప్రాసెసర్ తో రూ.20 వేల లోపే 5జీ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. కరోనావైరస్ కారణంగా ఈ సంవత్సరం ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో లాంచ్ కావాల్సిన స్మార్ట్ ఫోన్లన్నీ తమ లాంచ్ లను వాయిదా వేసుకున్నాయి. మే, జూన్ నుంచి ఈ ఫోన్లను లాంచ్ చేస్తున్నారు. క్వాల్ కాం ఈ వారం తన మిడ్ రేంజ్ ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 690ను ప్రకటించింది. మిడ్ రేంజ్ ఫోన్లలో ఈ ప్రాసెసర్ ను వినియోగించే అవకాశం ఉంది. ఈ ప్రాసెసర్ 5జీ సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇప్పటికే షియోమీలో రెండు 5జీ ప్రాసెసర్లు ఉన్నాయి. అవే క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865, క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 765జీ ప్రాసెసర్లు. అయితే స్నాప్ డ్రాగన్ 690 మిడ్ రేంజ్ లో 5జీ హ్యాండ్ సెట్ల ద్వారా లాంచ్ అయితే ఎక్కువ మంది వినియోగదారులకు చేరే అవకాశం ఉంటుంది. అయితే మన దేశంలో 5జీ నెట్ వర్క్ మాత్రం సమీప భవిష్యత్ లో అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు.అయితే ప్రస్తుతం 5జీ అనే పదం ఫేమస్ అయిపోయింది కాబట్టి మిగతా కంపెనీలు త్వరలో ఈ ప్రాసెసర్ లో 5జీ ఫోన్లను లాంచ్ చేసే అవకాశం ఉంది. హెచ్ఎండీ గ్లోబల్ కంపెనీ ప్రతినిధి ఈ ప్రాసెసర్ లాంచ్ అయిన సందర్భంగా క్వాల్ కాంను అభినందించారు. త్వరలో ఆ ప్రాసెసర్ ను తమ ఫోన్లలో ఉపయోగించే అవకాశం ఉందన్నారు. మిగతా కంపెనీలు కూడా ఈ ప్రాసెసర్ ను తమ కంపెనీల్లో ఉపయోగించే అవకాశం ఉంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 690 ప్రాసెసర్ తో స్మార్ట్ ఫోన్లు ఈ సంవత్సరం ద్వితీయార్థంలో లాంచ్ అవుతాయని కంపెనీ తెలిపింది. నోకియా కాకుండా ఎల్జీ, మోటోరోలా, షార్ప్, టీసీఎల్, వింగ్ టెక్ కంపెనీలు ఈ ప్రాసెసర్ తో ఫోన్లు లాంచ్ చేయనున్నాయి. ఇవి మీడియాటెక్ డైమెన్సిటీ 800 సిరీస్ ప్రాసెసర్లతో పోటీ పడనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com