కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తోంది. ఉత్తరప్రదేశ్ లో ఈ మాయదారి వైరస్ విజృంభిస్తోంది. కరోనా కారణంగా ఏకంగా శనివారం షాజహాన్ పూర్ జిల్లా కోర్టును మూసివేశారు. అంతకు రెండు రోజుల ముందు ఓ కేసులో వాదనలు వినిపించి అవతల పార్టీకి చెమటలు పట్టించిన క్రిమినల్ లాయర్ కు కరోనా సోకిందని తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కోర్టు హాల్, పరిసరాల్లో రసాయనాలను పిచికారీ చేశారు. కరోనా సోకిన లాయర్ క్లెయింట్ ను, ఆయనను కలిసిన ఇతర లాయర్లను, వ్యక్తులను క్వారంటైన్ కు తరలించారు.