ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటిదాకా ఒక్క కేసూ లేని జిల్లాలో ఒకేసారి 14 కేసులు నమోదయ్యాయి.అయితే తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలకమైన, కఠిన నిర్ణయం తీసుకున్నారు. తనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా అన్ని రకాల ప్రజాప్రతినిధుల జీతాల్లో 100 శాతం కోత పెట్టేశారు. ఈ మేరకు ఆర్థిక శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజాప్రతినిధులతో పాటు.. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర అఖిల భారత సర్వీసుల్లో పనిచేసే ఉద్యోగుల జీతాల్లో 60 శాతం కోత విధించింది. ఇతర అన్ని క్యాడర్ల ఉద్యోగస్తులకు 50% వాయిదా. నాలుగో తరగతి ఉద్యోగులకు 10 శాతం వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చింది. ఏ విభాగంలో పనిచేసి రిటైర్ అయినా, ఆయా ఉద్యోగులకు పై దమాషాలో పెన్షన్ అందజేయనున్నారు. ఇప్పటికే సబ్మిట్ చేసిన జీతాల బిల్లులను CFMS ద్వారా కేంద్రీకృతం చేసి 50శాతం గ్రాస్ శాలరీ వాయిదా వేయనున్నారు.