అమరావతి : మాజీ మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ .... జగన్ మతం,మానవత్వo కాదు... మూర్ఖత్వం. ఈ 6 నెలల్లో రాష్ట్రానికి మొత్తం రూ.67వేల కోట్లు నష్టం జరిగింది. రాష్ట్రంలో లక్ష బెల్ట్ షాపులు నడుస్తున్నాయి.మద్యం షాపుల పక్కనే బెల్ట్ షాప్ లు పెట్టి మద్యం అమ్ముతున్నారు.రాష్ట్ర రెవెన్యూ -17శాతానికి పడిపోయింది. రూ.30వేల కోట్లు ఆదాయాం పడిపోయింది
రూ.25వేల కోట్లు అప్పులు తెచ్చారు. మంచి ముఖ్యమంత్రి కాదు ముంచే ముఖ్యమంత్రి అంతానికి ఇవే సాక్ష్యాలు. పోలవరంలో టీడీపీ నిర్ణయాలన్నీ నియమ నిబంధనలు ప్రకారమే అని కేంద్రం స్పష్టం చేసింది. కక్ష వివక్షలే ఈ ప్రభుత్వ ప్రధాన అజెండాలు. సామాన్య మహిళ యలమంచిలి పద్మజ భావవ్యక్తీకరణ స్వేచ్ఛ పై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకున్నారు ? మoత్రులకో న్యాయం సాధారణ పౌరులకు మరో న్యాయమా? సామాన్యుల ఆర్ధిక మూలాలు దెబ్బతీసే విధంగా జగన్ వ్యవహారం ఉంది