మంత్రి కొడాలి నాని తమను కించపరిచేలా మాట్లాడారని మహిళా రైతు పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ప్రజలను పశువులు, గేదెలతో పోల్చారని ధ్వజమెత్తారు. మంత్రి పదవిలో ఉండి విచక్షణ మరిచి దూషించారని పద్మ అన్నారు. మంత్రి నానిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం పద్మ మీడియాతో మాట్లాడారు. తమ బట్టలూడదీసి నిలబెడతానని మంత్రి నాని అంటున్నారని, మహిళల బట్టలను నాని కట్టుకుంటారా? అంటూ ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని తేల్చిచెప్పారు.