కోదాడ: కోదాడలోని ఎల్ఐసి లో జరిగిన స్కాం బుధవారం వెలుగులోకి వచ్చింది. నకిలీ డెత్ సర్టిఫికెట్లతో రూ.కోట్లు టూఠీ చేసినట్లు తెలుస్తోంది. కోదాడ ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ సిబిఐ కిచ్చిన ఫిర్యాదు మేరకు.. సిబిఐ అధికారులు విచారణ మొదలుపెట్టారు. ఎల్ఐసి పాలసీదారుల నామినీలుగా ముందుగా తమ వారి పేర్లను నమోదు చేయించి.. పాలసీదారులు చనిపోయినట్లు నకిలీ డెత్ సర్టిఫికెట్లతో డబ్బు స్వాహా చేశారు. దాదాపు 190 పాలసీదారులకు చెందిన రూ.3.5 కోట్లు లూఠీ చేసినట్లు తెలుస్తోంది.