జనసేన అధినేత కల్యాణ్ గురువారం అమరావతికి రానున్నారని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. రేపు ఉదయం 9:30 గంటలకు హైదరాబాద్ నుంచి నేరుగా గన్నవరం ఎయిర్ పోర్టుకు పవన్ చేరుకొంటారని , అక్కడ్నుంచి పటమట లంకలోని తన నివాసానికి వెళ్లనున్నారని తెలిపారు.
మధ్యాహ్నం 2 గంటల నుంచి మంగళగిరి జనసేన కార్యాలయంలో పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల నేతలతో పవన్ సమీక్షా నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఆయా జిల్లాలల ప్రతినిధులు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఇప్పటికే పవన్ కార్యాయం నుంచి సంక్షిప్త సమాచారాలందించారు. ఈ సమీక్షలో ఎన్నికల ఫలితాలు, త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల గురించి నేతలతో పవన్ చర్చించనున్నారని, అనంతరం ప్రెస్మీట్ లో పార్టీ వ్యవహారాలపై మీడియాలతో ప్రత్యేకంగా మాట్లాడతారని తెలుస్తోంది..