వైద్య విద్య కోర్సుల్లో చేరడానికి దేశవ్యాప్తంగా నిర్వహించిన నేషనల్ ఎలిజబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులు నీట్ ఫలితాలను విడుదల చేశారు. జాతీయ మెడికల్ ఎంట్రన్స్ లో తెలంగాణాకు చెందిన మాదురీ రెడ్డి కి బాలికల విభాగంలో తొలి ర్యాంక్ లభించింది. ఆమెకు 720 మార్కులకు గాను 695 మార్కులను సాధించి బాలికల విభాగంలో తొలి ర్యాంక్ ను, జాతీయ స్థాయిలో ఏడో ర్యాంక్ ను దక్కించుకుంది. ఈ నిట్ ఫలితాలను ఈరోజు వి డుదల చేశారు. జాతీయ స్థాయిలో తొలి ర్యాంక్ ను రాజస్థాన్ కు చెందిన నలిన్ ఖందేల్ వాల్ కైవసం చేసుకున్నాడు. 720 మార్కులకు గాను 701 మార్కులు సాధించి టాప్ లో నిలిచారు. ఈ ఏడాది ఈ పరీక్షకు మొత్తం 14.10 లక్షల మంది హాజరయ్యారు. వారిలో 7.97 లక్షల మంది విద్యార్ధులు అర్హత మార్కులు సాధించారు.