ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోదీ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తా : పత్రాప్‌ చంద్ర సారంగి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 31, 2019, 12:06 PM

ఒడిశా: ప్రధాని నరేంద్రమోదీ తనపై నమ్మకాన్నిఉంచి కేంద్రమంత్రిగా అవకాశం ఇవ్వడం తన అదృష్టంగా భావిస్తున్నానని..పత్రాప్‌ చంద్ర సారంగి తెలిపారు. మోదీ కేబినెట్‌ లో మంత్రిగా నిన్న ప్రమాణస్వీకారం చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ..దేశానికి సేవ చేసేందుకు రాజకీయాలు వేదికలాంటివని అన్నారు. దేశానికి మొదటి ప్రాధాన్యత..పార్టీకి రెండో ప్రాధాన్యత..వ్యక్తిగత ప్రాముఖ్యత చివరిది. ఈ మూడింటికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. దేశ ప్రజలు, ప్రధాని నరేంద్రమోదీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తానని ప్రతాప్‌ చంద్ర సారంగి తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com