భోపాల్ : మధ్యప్రదేశ్లోని ఇండోర్ పవర్ ప్లాంట్లో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మొదట ఓ ట్రాన్స్ఫార్మర్లో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత క్షణాల్లోనే పవర్ ప్లాంట్ అంతటా మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. పవర్ ప్లాంట్లో అగ్నికీలలు ఎగిసిపడడంతో ఇండోర్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఇండోర్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మూడు రోజుల క్రితం ఇండోర్లోని గురునానక్ టింబర్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రెండు గోదాములు, రెండు దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.