ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారణాశి నుంచి బరిలోకి దిగనున్న ప్రియాంక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 16, 2019, 06:44 PM

 కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సోదరి, ఏఐసీసీ జనరల్‌ కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తాజా ఎన్నికల్లో వారణాశి నుంచి బరిలోకి దిగనున్నారు. ఈమేరకు ఆమె భర్త రాబర్ట్‌ వాద్రా వెల్లడించారు. భాజపా నుంచి ఈ స్థానానికి ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇద్దరూ కీలక వ్యక్తులే కావడంతో వారణాసి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. 


రాబర్ట్‌ వాద్రా మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రియాంక వారణాసి నుంచి పోటీ చేసేందుకు అంగీకరించారు. ఈ విషయంలో పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయమే అంతిమం’ అని అన్నారు. గత కొన్ని రోజులుగా ఈ స్థానానికి కాంగ్రెస్‌ నుంచి ఎవరు పోటీ చేస్తారా? అన్న విషయంపై సందిగ్ధత నెలకొంది. తాజాగా ఈ ఉత్కంఠకు రాబర్ట్‌ వాద్రా తెరదించినట్లయింది. ఏఐసీసీ జనరల్‌ సెక్రెటరీగా ప్రియాంక గాంధీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రచారంలో ఓ కీలకంగా పని చేస్తున్నారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ  నామినేషన్‌ పత్రాలు సమర్పించినప్పుడూ వాళ్లతో కలిసి వెళ్లారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com