మహిళలపై సిఎం చంద్రబాబు నిజమైన ప్రేమ ఉంటే..డ్వాక్రా రుణాలు మాఫీ చేసి ఎన్నికలకు రమ్మనమని ఎమ్మెల్యే రోజా సవాల్ విసిరారు. మీడియాతో మాట్లాడిన వైసీపీ మహిళా నేత రోజా.. మహిళలకు పసుపు కుంకుమ పథకం పెద్ద డ్రామా అని ఘాటుగా విమర్శించారు. తాళి బొట్లు తెంచిన బెల్ట్ షాప్ లు రద్దు చేసి.. ఎన్నికలకు రావాలని డిమాండ్ చేసారు. సంబరాల పేరుతో దోపిడీ చేస్తున్నారని మండిపడిన రోజా, సంబరాలకు వచ్చే టీడీపీ నేతలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. అవుట్ డేటెడ్ చంద్రబాబు కు మతి భ్రమించిందని, పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చి మోసం చేస్తున్నారని విమర్శించారు.
ఆత్రం పెళ్లి కొడుకు..అత్త మెడలో తాళి కట్టినట్లు సిఎం చంద్రబాబు ఏమి చేయాలో తెలియక జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు కాపీ కొడుతున్నారని విమర్శించారు. 57 నెలలు కడుపు మాడ్చి... మూడు నెలల ముందు ఏదో ఇచ్చినట్లు మోసం చేస్తున్నారని రోజా ఆరోపించారు. బెల్ట్ షాప్ ల రద్దు, ఆడవాళ్ళకు రక్షణ, డ్వాక్రా రుణాల మాఫి..ఈ మూడు హామీలను చంద్రబాబు నిలబెట్టుకోలేదన్నారామే.