థాంక్యూ బ్రదర్ మేకర్స్ నుండి రాబోతున్న రెండవ సినిమా "మాయాపేటిక". ఈ సినిమాలో విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్ పుత్, సునీల్, సిమ్రత్ కౌర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. రమేష్ రాపర్తి దర్శకత్వం వహిస్తున్నారు. శరత్ చంద్రా రెడ్డి, తారక్ నాధ్ బొమ్మి రెడ్డి నిర్మిస్తున్నారు.
లేటెస్ట్ గా మాయాపేటిక ఫస్ట్ సింగిల్ 'షన్నాషన్నా' లిరికల్ వీడియో విడుదలైంది. ఈపాటను గుణ బాలసుభ్రమణియన్ స్వరపరచగా, యశశ్వి కొండేపూడి, ప్రజ్ఞ నయని ఆలపించారు. శ్రీమణి లిరిక్స్ అందించారు.
రజత్ రాఘవ్, పృథ్వి రాజ్, శ్రీనివాస్ రెడ్డి, హిమజ, శ్యామల తదితరులు కీలకపాత్రలు పోషించారు.