రష్మిక మండన్న- 2016 లో విడుదలైన కన్నడ సినిమా కిరాక్ పార్టీతో సినీ రంగ ప్రవేశం చేసింది. రెండేళ్ల తరవాత నాగసౌర్య నటించిన ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వచ్చిన గీత గోవిందం తో ఇటు ఫ్యామిలీ ఆడియన్సులో,అటు యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
టాలీవుడ్లో వరస సినిమాలు చేసుకుంటూ మంచి విజయాలతో రష్మిక దూసుకుపోతుంది. పుష్పలో శ్రీవల్లిగా నటించి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది. దీంతో బాలీవుడ్లో కూడా రష్మిక వరస సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. మిషన్ మజ్ను, గుడ్ బై, యానిమల్ చిత్రాలలో రష్మిక నటిస్తుంది. ఇదిలా ఉంటె, తాజాగా ఒక మ్యాగజైన్ కవర్ పై మెరిసేందుకు ఫోటోషూట్లో పాల్గొన్న రష్మిక మీడియాతో ముచ్చటించింది. స్టార్ హీరోయిన్ గా పెరిగిన హోదా, ప్రైవసీ లేని జీవితం పట్ల రష్మిక మాట్లాడుతూ... స్టార్ ఇమేజ్ కావాలి అనుకుంటే మనపై వస్తున్న పుకార్లను, నెగిటివిటీని తట్టుకోగలగాలి. పెరుగుతున్న క్రమంలో ఇలాంటివన్నీ సహజమే. నటిగా నేను వెండితెరపై ఉండాలి అనుకుంటున్నాను కాబట్టి అలాంటి వార్తలను ముందుగానే ఊహించి మనసుకు సర్ది చెప్పుకుంటాను అని చెప్పింది. నాపై ఎలాంటి పుకార్లు వచ్చినా నేను పెద్దగా పట్టించుకోను. ప్రేక్షకులను, అభిమానులను ఎంటర్టైన్ చెయ్యటానికే ఇక్కడ ఉందని, అదే జరిగినప్పుడు సంతోషం కాక ఇంకేముంటుంది రష్మిక తన అభిప్రాయం చెప్పింది.