గుంటూరు: అమృత్ పనులతో చిలకలూరిపేటకు ఇక తాగునీటి ఎద్దడి ఉండదని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. ఇవాళ చిలకలూరిపేటలోని ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణ పనులకు మంత్రి ప్రత్తిపాటి భూమిపూజ చేశారు. అమృత్ పథకం రెండో విడత కింద రూ.139 కోట్లతో ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణం చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ఈ పనులు పూర్తయితే చిలకలూరిపేటలో తాగునీటికి ఇబ్బందులు ఉండవని తెలిపారు.