ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్తాన్ లో ఖతార్ ఎయిర్ వేస్ అత్యవసర ల్యాండింగ్

international |  Suryaa Desk  | Published : Mon, Mar 21, 2022, 03:28 PM

దిల్లీ నుంచి ఖతార్ రాజధాని దోహాకు వెళ్తున్న విమానాన్ని...... సాంకేతిక కారణల వల్ల పాకిస్తాన్ లోని కరాచీలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఖతార్ ఎయిర్ వేస్ కు చెందిన QR 579 విమానాన్ని..... కార్గోలో పొగల కారణంగా అత్యవసరంగా కరాచీకి దారి మళ్లించామని అధికారులు తెలిపారు. విమానంలో 100 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారని... విమానం సురక్షితంగా కరాచీలో ల్యాండ్ అయ్యిందని వివరించారు. తమకు ఆహారం, నీళ్లు ఇవ్వడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ప్రయాణికులను మరో విమానంలో దోహాకు తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు ఖతార్ ఎయిర్ లైన్స్ తెలిపింది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామన్న ఖతార్ ఎయిర్ లైన్స్.. అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపింది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com