శివసేన ఎంపీ సంజయ్రౌత్ ఎంఐఎం పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని అధికార కూటమిలో ఎంఐఎం పార్టీని చేర్చుకునే ప్రస్తకి లేదని చెప్పారు. శనివారం మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఎంఐఎంతో పొత్తు అంటే అంటు రోగాన్ని అంటించుకోవడమేనని విమర్శించారు. బీజేపీతో ఎంఐఎం పార్టీ చీకటి ఒప్పందం ఉందన్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ ఆశయాలతో నడిచే శివసేనకు ఎంఐఎం (MIM)తో పొత్తు ఎన్నటికీ కుదరదన్నారు. భవిష్యత్లోనూ ఇలాంటి ఆలోచనకు తావులేదని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని ఎంఐఎం నేత ఇంతియాజ్ జలీల్తో ఆయన భేటీ అయ్యారు. దీనిపై రాజకీయ వర్గాల్లో పలు ఊహాగానాలు చెలరేగాయి. దీనిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టతనిస్తూ తాజా ప్రకటన చేశారు.