తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులపై స్థానిక పోలీసు అధికారులు, స్థానిక ఎమ్మెల్యే, అతని కుమారుని ఒత్తిళ్లకు తలొగ్గి అక్రమ కేసులు బనాయిస్తున్నారని టిడిపి వినుకొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆరోపించారు. అక్రమ కేసులు బనాయిస్తున్న వినుకొండ పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం డిఐజి త్రివిక్రమ వర్మను కలిసి శాంతిభద్రతల సమస్యపై ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, అతని కుమారుడు గిరిబాబు పోలీస్ అధికారులపై ఒత్తిడి చేసి టీడీపీ నాయకుల పై, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని వివరించారు. రాజకీయ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు.