ట్రెండింగ్
Epaper    English    தமிழ்

100కి అదనంగా 10 జీబీ వరకు 3జీ, 4జీ డేటా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 23, 2017, 09:49 AM

వెల్ కమ్ ఆఫర్లతో దేశీయ టెలికాం కంపెనీలకు జియో ముచ్చెమటలు పట్టించింది. అతి తక్కువ కాలంలోనే కోట్లాది మంది వినియోగదారులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో, జియోను తలదన్నే ఆఫర్ ను ఎయిర్ టెల్ ప్రకటించింది. కేవలం రూ. 100కి అదనంగా 10 జీబీ వరకు 3జీ, 4జీ డేటాను అందించనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్లాన్ లకు ఈ డేటాను అదనంగా అందించనుంది. 


మంగళవారం నాడు తన ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ను జియో ప్రకటించిన నేపథ్యంలో, ఎయిల్ టెల్ ఈ బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. అంతేకాదు, జియో కంటే చీప్ గా డేటా ఆఫర్లను తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంది ఎయిర్ టెల్. అయితే, ఈ ఆఫర్ కొన్ని వారాల పాటు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఎయిర్ టెల్ ప్రతినిధి తెలిపారు. మొత్తం 28 రోజుల వరకు ఈ 10జీబీ ఆఫర్ ఉంటుందని చెప్పారు. గత ఏడాది రూ. 259కి 10జీబీ ఆఫర్ ను ఎయిల్ టెల్ అందంచింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com