లండన్: భారత్లో ప్రధాన పార్టీలు తనను ఫుట్బాల్లా ఆడుకుంటున్నాయి అని లిక్కర్ టైకూన్ విజయ్మాల్యా అన్నారు. ఈ విషయం ఇటీవల ఎన్నికల్లో పార్టీ నేతల ప్రసంగాల్లో తేటతెల్లమైందని తెలిపారు. వారు ఆధారాలతో రానివ్వండి.. అసలు వాళ్ల దగ్గర ఆధారాలు ఉంటే చట్టం ఎప్పుడో తనపని తాను చేసుకుపోయేదని అన్నారు. యూకే చట్టాల కింద సురక్షితంగా ఉన్నానన్నారు. భారతప్రభుత్వంలో ఎవరో దయతో బతికే కంటే ఇది సురక్షితమని మాల్యా తెలిపారు.