అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముంబై బయలుదేరారు. ముంబైలో జరగనున్నఫ్యూచర్ డీకోడెడ్ పై మైక్రోసాఫ్ట్ నిర్వహిస్తున్న సదస్సులో ప్రసంగించనున్నారు. అనంతరం ఆయన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యా నాదెళ్లతో భేటీ అవుతారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిజిటల్ సాంకేతక వినియోగంలో మైక్రోసాఫ్ట్ సహకారంపై చర్చిస్తారు.