చిత్తూరు: మన దేశంలోనే పురాతన ఆలయం గుడిమల్లం పరశురామేశ్వరస్వామి ఆలయ చరిత్రపై తాను ఓ పుస్తకాన్ని రచించనున్నట్లు ప్రముఖ సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి అన్నారు. మంగళవారం ఆయన గుడిమల్లం ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గిరినాయుడు ద్వారా ఆలయ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ఆనంతరం ఆలయ పూజారి వంశీకృష్ణశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేకపూజలు చేయించారు. ఆలయ చిత్రపటాన్ని, ప్రసాదాలను ఆయనకు అందించారు.