గుంటూరు: విభిన్న ప్రతిభావంతుల పట్ల అసభ్య వ్యాఖ్యలు చేస్తున్న రోజా నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఏపీ విభిన్న ప్రతిభావంతుల కమిటీ ఛైర్మన్ కోటేశ్వరరావు అన్నారు. జిల్లా టిడిపి కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గన్నవరంలో రోజా మాట్లాడిన తీరు చూస్తే మొగుడిని కొట్టి తానే ఏడ్చినట్లు ఉందన్నారు. ఆమె హావభావాలను చూసిన మహిళా లోకం ఎంతో బాధపడిందన్నారు. ప్రతిపక్ష శాసన సభ్యురాలుగా ఉండి ప్రజా సమస్యలపై పోరాడకుండా తెలుగుదేశం నాయకులను అర్థం పర్థం లేని విమర్శలతో కాలక్షేపం చేస్తుందన్నారు. రోజాకి ఏదైన సమస్య ఉంటే ఉదాహరణకు ఆమె కూతురు మీదో, లేదా భర్త మీదో ఉదహరించుకోవాలి కాని విభిన్న ప్రతిభావంతుల మనోభావాలు కించపరిచే విధంగా ఉంటున్న భాషను మార్చుకోకపోతే డ్రైనేజి లాంటి ఆమె నాలుకను విభిన్న ప్రతిభావంతులు కోసే రోజు వస్తుందన్నారు.